ఘోర రోడ్డు ప్రమాదాలు.. 9మంది మృతి | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదాలు.. 9మంది మృతి

Published Sun, May 13 2018 10:17 AM

Nini Members Killed  In Tamil Nadu Road Accidents

సాక్షి, చెన్నై : తమిళనాడులో ఆదివారం వెర్వేరు ప్రాంతాల్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందగా, 14 మందికి తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరు జిల్లాలో లారీ- కారు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరొక ఘటన రామేశ్వరంలో జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వ్యాను- లారీని ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే నలుగురు మృతి చెందారు. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోనే ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement